ఏలూరు జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలేనికి చెందిన మజ్జి ఏసురాజు(26) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే యువకుడి హత్యకు కారణమని తేల్చారు. తన భార్యతో ఏసురాజు కలిసి ఉండడాన్ని చూసిన ఆమె భర్త, తండ్రికి సమాచారమిచ్చాడు. అతడు మరొకడని వెంటపెట్టుకొని వచ్చి మెసేజులు పంపుతావా అని ఏసురాజు చేయిని నరికేశారు. తర్వాత అతడిని ఓ పంటకాలువలో పడేసి వెళ్లిపోయారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఏసురాజు మృతి చెందినట్లు తెలిపారు.