AP: అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ యువకునితో తన్మయి బైక్పై వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో బీరు బాటిల్తో తలపై కొట్టి, పెట్రోల్ పోసి చంపినట్లు సమాచారం. హత్యకు పాల్పడింది తానే అని నరేశ్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. నరేశ్ ఏడాదిన్నర క్రితం ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. తన్మయి వివాహం చేసుకోవాలని కోరడంతో నరేశ్ హత్యకు పాల్పడినట్లు తెలిసింది.