మస్తాన్ సాయితో పాటు ఖాజా అనే వ్యకిని కూడా నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. వీరిద్దరూ కలిసి తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె తెలిపారు. మస్తాన్ సాయి తల్లిదండ్రులు హార్డ్డిస్క్ కోసం తనను చంపాలని చూశారన్నారు. తనకు ప్రాణహాని ఉందని లావణ్య తెలిపారు. దీంతో మస్తాన్సాయిపై BNS యాక్ట్లోని 329(4), 324(4), 109, 77, 78 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.