తన జీవితకాల కోరిక నెరవేరబోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే గోదారి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కాళ్ళు కడిగి తన రుణం తీర్చుకోవటమే తన ఆశయమని ఎన్నికల సమయంలో చెప్పారు. అనుకున్నదే తడవుగా సీఎం రేవంత్ చొరవతో ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పారించడం ఖాయంగా కనిపిస్తుందన్నారు.