HYD-నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ BJP అధ్యక్షుడిగా ఎన్ రామచందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన నివాసం నుంచి ర్యాలీగా వచ్చిన రామచందర్రావు.. ఉస్మానియా వర్సిటీలోని సరస్వతీ దేవాలయంలో, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, మురళిధర్రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.