తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. అటు సినీ నటుడు నాగార్జున కుటుంబం, అలాగే సమంత విషయంలో సంచలనం సృష్టించాయి.తన కుటుంబ ప్రతిష్ఠను దిగజార్చేందుకే కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు. కుటుంబ పరువు తీశారని, ఆమెపై క్రిమినల్ కేసు పెట్టాలని ఆయన అభ్యర్థించారు. అంతేకాకుండా.. కొండా సురేఖపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో కూడా ఉన్నట్లు తెలిపారు.