నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం బి కే లక్ష్మాపూర్ గ్రామంలో మంగళవారం జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ సందర్శించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు, ఎక్స్-రే సేవలు అందించడంతో పాటు, అవసరమైన మందులను పంపిణీ చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.