కల్వకుర్తి: సీఎం చదివిన పాఠశాల అభివృద్ధికి శంకుస్థాపన

80చూసినవారు
కల్వకుర్తి: సీఎం చదివిన పాఠశాల అభివృద్ధికి శంకుస్థాపన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదివిన జడ్. పి. హెచ్. ఎస్ తాండ్ర పాఠశాలకు రూ 10 కోట్లతో అభివృద్ధి పనులకు బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. జడ్. పి. హెచ్. ఎస్ తాండ్ర పాఠశాలను మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్