నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగే బీసీ చైతన్య సదస్సుకు బీసీ కుల సంఘాలు, విద్యావంతులు, రాజకీయ నాయకులు హాజరు కావాలని గురువారం కల్వకుర్తి పట్టణంలో కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు రాజేందర్, సదానందంగౌడ్, మొగిలి దుర్గ ప్రసాద్, రవి గౌడ్, బోడ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.