అచ్చంపేట పట్టణంలోని 13వ వార్డులో పిచ్చి మొక్కలు పెరిగి పారిశుధ్యం లోపించిందని ప్రజలు మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు దృష్టికి తీసుకువెళ్లారు. మున్సిపల్ చైర్మన్ వెంటనే స్పందించి బుధవారం వార్డులోని పిచ్చి మొక్కలను జేసీబీ సాయంతో శుభ్రం చేయించారు. చైర్మన్ స్పందించడంతో సమస్య తీరిందని వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.