నాగర్ కర్నూల్: 17వ వార్డు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

54చూసినవారు
నాగర్ కర్నూల్: 17వ వార్డు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 17వ వార్డులో గల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గురువారం కాలనీవాసులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి విన్నవించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని తెలిపారు. 17వ వార్డులో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సురేందర్, నరసింహ, నిరంజన్, రాము, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్