దేవరకొండ: ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల ఆలనా పాలన రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. ప్రభుత్వ గురుకులాల్లో చదివి ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరచిన విద్యార్థులను శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లచ్చిరాం, పాప నాయక్, రాంసింగ్, సీత్యా, నాగేశ్వర్ రావు, ప్రిన్సిపాల్ కళ్యాణి, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.