దేవరకొండ: భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి రూ. 12 వేలు, ఎలాంటి కొర్రీలు లేకుండా ఉపాధిహామీ కార్డు ఉన్నవారికి సంవత్సరానికి 12 వేలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ అన్నారు. శుక్రవారం పట్టణంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంగలయ్య, బారీములు, హుస్సేన్, ఆంజనేయులు, బుచ్చయ్య, దేవిలాల్, శంకర్, లాలయ్య, రాములు, బాబు, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.