
పీ-4తో 20 లక్షల పేద కుటుంబాల దత్తత
పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మార్చడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల పేద కుటుంబాల బాధ్యత తీసుకునేలా మార్గదర్శకులను తీసుకొస్తామని ప్రకటించారు. ఆగస్టు 15న పీ-4ను పూర్థి స్థాయిలో ప్రారంభిస్తామన్నారు. సమాజంలోని 10 శాతం మంది ధనికులు 20 శాతం మంది పేదలను దత్తత తీసుకోవాలన్నారు. బంగారు కుటుంబం-మార్గదర్శి విధానంలో ఇప్పటికే రాష్ట్రంలో 15 వేల కుటుంబాలు దత్తత తీసుకున్నారన్నారు.