ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. ఇద్దరు మృతి

56చూసినవారు
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. ఇద్దరు మృతి
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం చిలకమర్రి సమీపంలో శుక్రవారం ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతులు గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన ధనయ్య, దేవరోనితండాకు చెందిన లక్ష్మిగా గుర్తించారు. రైస్ మిల్ పనులకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్