కనగల్ మండలం ధర్వేశిపురం, పర్వతగిరి గ్రామాల శివారులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. రేణుకా ఎల్లమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు కుంకుమార్చనలు చేశారు. భక్తులకు అర్చనలు చేసి, అర్చకులు అమ్మవారి ఆశీర్వాదాన్ని అందించారు.