బెదిరించి కండువాలు కప్పడమే కాంగ్రెస్ చేస్తున్న పని

69చూసినవారు
జిల్లా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న పని బీఆర్ఎస్ నేతలను అదిరించో, బెదిరించో కాంగ్రెస్ కండువాలు కప్పడమేనని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్గొండ ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డికి మద్దతుగా శుక్రవారం దేవరకొండలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఓటేస్తే కృష్ణా నీరు పోయిందని, బీజేపీకి ఓటేస్తే గోదావరి నీళ్ళు పోతాయన్నారు. కేసిఆర్ తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్నాడని అన్నారు.

సంబంధిత పోస్ట్