సాక్షి దిన పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించడాన్నీ ఖండిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జర్నలిస్టులు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే మీడియా పట్ల కక్ష్య సాధింపు ధోరణితో వ్యవహరించడం అప్రజాస్వామికం అన్నారు.