డోర్నకల్ నుంచి మిర్యాలగూడ వరకు 97. 45 కిలోమీటర్ల మేర రూ. 1967. 87 కోట్లు అంచనా వ్యయంతో కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్ పూర్తయితే మిర్యాలగూడకు దగ్గర్లో నిర్మిస్తున్న యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంటుకు సింగరేణి బొగ్గు, సూర్యాపేట, నల్లగొండ జిల్లా నుంచి ధాన్యం, బియ్యం, సిమెంట్, ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలకు సరుకు రవాణా ఎంతో ఉపయోగపడనుంది.