మిర్యాలగూడ విద్యుత్ కార్యాలయం డివిజనల్ ఇంజనీర్ ఎ. శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలను రైతులతో పాటు ఇతరులు సంబంధిత లైన్ మెన్ లతో పాటు ఏఈ ఏడీఈ స్థాయి అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లాలని కోరారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని పశువులను ట్రాన్స్ఫర్మర్ ల పరిసరాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో ఎడిఈ కోడిరెక్క రవికుమార్, సబ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ఉన్నారు.