దేశానికే తలమానికంగా ఖమ్మం బీఆర్ఎస్ సభ

1635చూసినవారు
దేశానికే తలమానికంగా ఖమ్మం బీఆర్ఎస్ సభ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశానికే తలమానికంగా మారుతుందని బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు బొల్ల ప్రవీణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ , పంజాబ్ ముఖ్యమంత్రి భగవంథ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా ఇంకా చాలా మంది ప్రముఖులు హాజరుకానున్నారని, ఖమ్మం సభతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి దిశానిర్దేశం చేయనున్నారని, ఈ సభకు మునుగోడు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివెళ్లాలని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్