మర్రిగూడ మండలంలోని గురువారం వట్టిపల్లిలో ప్రాథమికోన్నత పాఠశాల ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు పాల్వాయి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందంతో చౌరస్తా లో ఉన్న కాలనీలో గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల గొప్పతనం, పాఠశాలలో జరుగుచున్న ఇంగ్లీష్ మీడియం బోధన, చదువుతోపాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.