గట్టుప్పల్ మండలం తేరట్ పల్లి గ్రామంలో శ్రీముత్యాలమ్మతల్లి తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో శనివారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోమం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గట్టుప్పల్ లో రూ.1 కోటి 43 లక్షల వ్యయంతో నిర్మించబోయే ప్రాథమిక ఆరోగ్యకేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి భూమిపూజ చేశారు. రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.