చిట్యాల: సంతాప సభలో పాల్గొన్న సీపీఎం నాయకులు

74చూసినవారు
చిట్యాల: సంతాప సభలో పాల్గొన్న సీపీఎం నాయకులు
చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో గురువారం జరిగిన గ్రామపంచాయతీ కార్మికుడు శంకరయ్య సంతాప సభలో సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ పాల్గొని మాట్లాడారు. మెరుగుమళ్ళ శంకరయ్య అకాల మరణం గ్రామ పంచాయతీ కార్మిక సంఘానికి తీరని లోటని అన్నారు. శంకరయ్య కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శంకరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్