చిట్యాలలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా సాగు, త్రాగు నీరు సమస్యలు పరిష్కరించాలంటే యస్ యల్ బి సి సొరంగ మార్గం, డిండి ఎత్తిపోతల, బ్రాహ్మణ వెల్లంల (ఉదయసముద్రం) వంటి నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.