సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేద ప్రజలకు వరం లాంటిదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తమ క్యాంపు కార్యాలయంలో వివిధ అనారోగ్యా కారణాల రీత్యా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 37 మందికి సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సంవత్సరానికి రూ 1000 కోట్లకు పైన రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ నిరుపేదలకు ఆసరాగా నిలుస్తుందని తెలిపారు.