చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పదేండ్ల చీకటిని పారద్రోలి ప్రజలు వెలుగుల రేఖలను సృష్టించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజాపాలనపై విషం చిమ్ముతున్న అజ్ఞానులకు జ్ఞానదీపం వెలిగేల లక్ష్మీదేవి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మంత్రి కోరుకున్నారు.