తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడటం పట్ల యూత్ కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ నాయకులు బొల్ల ప్రవీణ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి ఈ ఎన్నికల ఫలితాలు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారని, అలాగే కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందన్నారు.