కనగల్లు మండలం రామచంద్రపురం గ్రామంలో ఈనెల 17న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు అంబేద్కర్ యూత్ అధ్యక్షులు మారేపల్లి సందీప్ తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కనగల్లు ఎస్సై విష్ణుమూర్తినీ ఆహ్వానించారు యూత్ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో అందుగుల వెంకటేష్, మెండికత్తి యాదయ్య, అందుగుల వెంకన్న పాల్గొన్నారు.