మాడుగులపల్లి మండల కేంద్రంలోని ఆదివారం బీజేపీ కార్యాలయం నందు మాడుగులపల్లి మండల ఎస్సీమోర్చ అధ్యక్షులు దాసరి నాగరాజు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగులపల్లి మండల అధ్యక్షులు ఇటకాల జాన్ రెడ్డి,జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు బొమ్మకంటి నరసింహ, మండల నాయకులు రాచకొండ దశరథ. దారమల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.