మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందంటూ ఏమీ లేదని శనివారం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. చండూర్ పట్టణంలో విస్తృత పర్యటన చేసి స్థానిక సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణం పూర్తిగా అభివృద్ధిలో నుంచి వెనక్కి వెళ్తోంది. ఎమ్మెల్యే నిర్లక్ష్యం ప్రధాన కారణమని ధ్వజమెత్తారు. పూర్తి చేయాల్సిన డ్రైనేజీ పనులు అర్ధాంతరంగా ఆపేయడం వల్ల మురుగు నీటితో జనజీవనం అయోమయంగా మారిందన్నారు.