శనివారం మాల మహానాడు నల్గొండ జిల్లా కార్యాలయంలో పీవీ రావు 73వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల అభ్యున్నతకే తన జీవితాన్ని ధారబోసిన త్యాగమూర్తి మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పీ. వీ. రావు అన్నారు.