నల్గొండ జిల్లా కేంద్రంలోని తులసినగర్ లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి 4 దుకాణాల అద్దె, కొబ్బరి చిప్పలను సేకరించుటకై ఈ నెల 16న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ కుశలయ్య గురువారం తెలిపారు. బహిరంగ వేలం ద్వారా కిరాయికి ఇచ్చుటకు 16న ఉదయం 10:30 గంటలకు నిర్వహించే సమావేశానికి అర్హులైన వారందరూ హాజరుకావాలన్నారు.