స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన మలిదశ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఐతగోని శేఖర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇండ్లు, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు అందించాలని కోరారు.