నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో గురువారం ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే చక్కని విద్య లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.