తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభసందర్భంగా ప్రజలందరికి శ్రీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.