ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీఓ 60ప్రకారం వేతనాలు రూ. 22, 750లకు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమిత్రలకు డాటా ప్రాసిసెంగ్ ఆఫీసర్ కేడర్ను కల్పించాలన్నారు. ఆరోగ్యమిత్రల వేతనాలను ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా ట్రస్టు ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు.