భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పరిరక్షణ కోసం ఉద్యమించాలని ఎఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉజ్జినీ రత్నాకర్ రావు పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం నల్లగొండజిల్లా 7వ మహాసభ లో అయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు ఈరోజు సమస్యల నిలయముగా మారిందని ఆరోపించారు.