జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2022-24 మధ్యకాలంలో 1.55 కోట్ల మంది ఉపాధి హామీ కార్మికుల పేర్లను తొలగించినట్లు పార్లమెంటులో కేంద్ర సహాయ మంత్రి కమలేశ్ పాసవాన్ వెల్లడించారు. నకిలీ, తప్పుడు జాబ్ కార్డులు, గ్రామాల నుంచి కార్మికుల కుటుంబాలు తరలిపోవడం/సంబంధిత గ్రామాలను పట్టణాలుగా వర్గీకరించడం తదితర అంశాలు కారణమైనట్లు వివరించారు.