జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం మాజీమంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ ఆలయంలోకి తీసుకెళ్లారు. పూజా కార్యక్రమాల అనంతరం వారికి శాలువా కప్పి, పూలమాలవేసి సత్కరించారు.