జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 3 వ వార్డు పరిధిలోని హమాలీ కాలనీలో గురువారం వీధి కుక్కలు స్వైర విహారం చేసి ఇద్దరు చిన్నారులపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారులు హస్మిత, రీషికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు గాయపడిన చిన్నాలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు.