2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 5న సోమవారం స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుందని ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల ప్రిన్సిపాల్ ఎం. రాజారాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన గిరిజన విద్యార్థులు మాత్రమే తమ ధ్రువపత్రాలతో ఆ రోజు ఉదయం 10 గంటలకు కళాశాలలో కౌన్సెలింగ్ కు హాజరు కావాలని సూచించారు.