నారాయణ పేట్ జిల్లా నర్వ మండలంలోని జంగంరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తహశీల్దార్ మల్లారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వంట విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.