రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మహిళా సంఘం రాష్ట్ర కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి. బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని 16వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.