వనపర్తి ఎస్పీ రావుల గిరిధరన్ ను గిరిజన సేవ సంఘం జిల్లా అధ్యక్షులు ముడావత్ చంద్రు నాయక్, మాజీ జిల్లా అధ్యక్షులు జాత్రు నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఆంగోత్ రాజ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో ఎస్పీతో కలిసి మామిడి మొక్కలు నాటారు. సుధాకర్ నాయక్, మాజీ జడ్పీటీసీ ధర్మనాయక్, కృష్ణ నాయక్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.