రవాణా రంగంపై కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మే 20న దేశవ్యాప్తంగా బంద్కు ట్రాన్స్పోర్ట్ యూనియన్లు పిలుపునిచ్చాయి. మోటారు వాహన చట్టంలో చేసిన మార్పులతో స్వయం ఉపాధి అవకాశాలు నశిస్తున్నాయని, రవాణా రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లోకి అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో బంద్ను సమర్థవంతంగా నిర్వహించి, రవాణా కార్మికుల హక్కులను రక్షించాల్సిన అవసరముందని ప్రజలను కోరాయి.