డబుల్ ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా వరుస అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నాడు. జావెలిన్ త్రోయర్గా ప్రఖ్యాతి పొందిన ఆయన జూన్ 24న చెక్ రిపబ్లిక్లో జరిగే ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ 2025 అథ్లెటిక్స్ మీట్లో పాల్గొననున్నాడు. ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ 1961 నుంచి జరుగుతోంది. ఈ మీట్కు ముందుగా ఆయన మే 16న దోహా డైమండ్ లీగ్లో, మే 24న బెంగళూరులో జరగనున్న క్లాసిక్లోనూ పోటీపడతాడు.