పెళ్లయిన ఐదు రోజులకే గుండెపోటుతో నవ వరుడు మృతి

75చూసినవారు
పెళ్లయిన ఐదు రోజులకే గుండెపోటుతో నవ వరుడు మృతి
ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన 5 రోజులకే గుండెపోటుతో నవ వరుడు మృతి చెందాడు. మృతుడు.. కర్ణాటక రాష్ట్రం వెంగసంద్రాకు చెందిన కార్తీక్ (28)గా గుర్తించారు. శుక్రవారం ఛాతిలో నొప్పి రావడంతో భార్యతో కలిసి ఆసుపత్రికి వెళ్లగా, చికిత్స పొందుతూ మరణించాడు. కార్తీక్ కు రామకుప్ప మండలం కొల్లుపల్లి చెందిన భవానితో ఐదు రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ ఘటనతో వరుడి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్