తెలంగాణలో త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025 రానుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలు సవరించాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్లలో మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పాత అపార్ట్మెంట్లకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు.