దేశంలో కరోనా కొత్త వేరియంట్ను కొనగొన్నట్లు భారత సార్స్ కోవ్ జీనోమిక్స్ కన్సార్షియం తెలిపింది. కొత్త వేరియంట్ను XFGగా గుర్తించినట్లుగా పేర్కొంది. ఈ వేరియంట్ తొలుత కెనడాలో వెలుగుచూసిందని వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా కేసులు దేశంలో 6,491కి చేరాయి. 24 గంటల వ్యవధిలో 358 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేరళలో 1957 కేసులు నమోదు కాగా, అతి తక్కువగా తెలంగాణలో 9 కేసులు నమోదయ్యాయి.